KDP: లక్ష్మిపాలెం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. గోవిందా నామస్మరణతో లక్ష్మిపాలెం మాడవీధులు మారుమోగాయి.భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.