అన్నమయ్య: మదనపల్లి–కర్ణాటక సరిహద్దులో చీకిలబైలు సమీపంలోని చెక్పోస్టు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన బషీర్ బాష మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ కోమాలో ఉన్నట్లు రాయల్పాడు ఎస్సై రామా తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం శ్రీనివాసపురం ఆసుపత్రికి తరలించారు.