W.G: ఉండి నియోజకవర్గంలో “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ సమ్మాన్ నిధి” పథకం రెండవ విడత నిధులు విడుదల, పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. రెండవ విడత కింద నియోజకవర్గంలోని 9,629 మంది రైతులకు రూ.6,61,00,000 నగదు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు.