ATP: శింగనమల మండల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొంటారని తహశీల్దార్ శేషారెడ్డి బుధవారం తెలిపారు. మండలంలోని సమస్యలు ప్రజలు అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించి, వాటిని పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారని ఆయన వెల్లడించారు.