SKLM: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 24న పొందూరులో ఓ ప్రైవేట్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 16 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని, 650 ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలిపారు. 18–30 ఏళ్ల వయస్సు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.