AKP: యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెదపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీవిశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. రేజేటి శ్రీరామాచార్యులు చేతుల మీదుగా వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. సంప్రోక్షణ, జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం నిర్వహించి దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు.