PPM: గిరిజన పీజీఆర్ఎస్తో గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాల్లో గిరిజనుల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు.