CTR: పుస్తక పఠనంతో వివేకం, విలువలు పెంపొందుతాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ శాఖ ఛైర్మన్ గురువారెడ్డి అన్నారు. మంగళవారం పుంగనూరు పట్టణంలోని గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లను అవసరానికి మించి ఉపయోగిస్తున్నారన్నారు. వాటికి దూరంగా ఉండాలని సూచించారు.