PPM: జిల్లా పోలీసు శాఖలో ఎఎస్ఐగా పనిచేస్తూ ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందిన ఆర్.ఆదినారాయణ కుటుంబానికి ఎస్.బి.ఐ శాలరీ ప్యాకేజ్ కింద రూ.10 లక్షల చెక్కును ఆయన సతీమణికి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం అందజేశారు. జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పి.ఎస్.పిని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, ఎ.ఆర్.డీఎస్పీ పాల్గొన్నారు.