సత్యసాయి: పెనుకొండలోని BTR కాలనీలో ఎంపీపీ పాఠశాలను మంత్రి సవిత శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆహార నాణ్యతలో ఎలాంటి లోపాలు కనిపించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.