కృష్ణా: జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు శక్తి టీం నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి ప్రజా ప్రదేశాల్లో శక్తి యాప్ వినియోగం, మహిళల భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో తమ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు ఎవరితోనో పంచుకోవద్దని సూచించారు.