TPT: వెంకటగిరి పరిధిలో దారుణ హత్య జరిగింది. రైల్వేస్టేషన్ నుంచి పెట్లూరుకు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని గురువారం ఉదయం గుర్తించారు. మృతుడు అమ్మపాలెం గ్రామానికి చెందిన శివారెడ్డి (23)గా గుర్తించారు. మంగళవారం సాయంత్రం అతను అదృశ్యమయ్యాడు. ఇలా శవంగా కనబడటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.