గుంటూరులో మంగళవారం ముస్లిం సోదరుల కోసం వైసీపీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వాయిదా పడింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొనాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త తేదీని త్వరలో తెలుపుతామని ప్రకటించారు.