సత్యసాయి: హిందూపురంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో ఆదివారం జిల్లా జూనియర్ బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు జేవీ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మండల ఫుట్బాల్ క్లబ్ నుంచి ధ్రువపత్రం తీసుకురావాలని సూచించారు. వివరాలకు కార్యదర్శి మహమ్మద్ సలీమ్ను నంబర్ 8099598958 ను సంప్రదించాలని కోరారు.