VSP: అగనంపూడిలోని బీసీ కాలనీలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ శాఖలో దీపావళి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఏడీసీ ఛైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఈ వేడుకలను ప్రారంభించి, దీపావళి ప్రతి ఒక్కరిలో జ్ఞాన కాంతులను వెలిగించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మకుమారి సంస్థ సేవలను ఆయన కొనియాడారు.