TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 19 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 22న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించనున్నారు. ఆయన జన్మనక్షత్రం అరుద్ర సందర్భంగా ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీరామానుజులవారిని బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగించారు.