NLR: టీపీ గూడూరు, సౌత్ ఆములూరులో కూటమి నేతల దాడిలో గాయపడిన వైసీపీ నాయకుడు శ్రీనివాసులును మాజీ మంత్రి కాకాని ఇవాళ పరామర్శించారు. టీడీపీ నాయకుల దాడిని ఖండించిన కాకాని, శ్రీనివాసులు తలకు 6 కుట్లు పడినా మొక్కుబడిగా బెయిలబుల్ కేసులు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు అని ఆయన పేర్కొన్నారు.