KRNL: ఆత్మకూరులో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. TDP ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరులో పర్యటించేందుకు వచ్చిన నంద్యాల MP బైరెడ్డి శబరిని స్థానిక TDP నాయకులు అడ్డుకున్నారు. MLAకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా పర్యటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఇంటింటి పర్యటన మధ్యలోనే నిలిపివేశారు.