ఎన్టీఆర్: అనిగండ్లపాడు నుంచి పెనుగంచిప్రోలు మండలంలో దేవస్థానానికి కొల్లా వారి ఇంటి నుంచి బయలుదేరిన పసుపు-కుంకుమ బండ్లకు కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ శ్రీ నెట్టెం రఘురామ్ శనివారం రాత్రి కొబ్బరికాయ కొట్టు ప్రారంభించారు. అనంతరం తెలుగు యువత ఏర్పాటు చేసిన ప్రభను సందర్శించి యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు.