NLR: జిల్లాలో రానున్న పంటకాలానికి సాగునీటిని విడుదల చేసే లోపు కాలువల పూడికతీత, మరమ్మత్తు పనులను తక్షణమే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతులకు సమయానికి సాగునీరు అందాలంటే ముందస్తు చర్యలు అత్యవసరమని స్పష్టం చేశారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.