ప్రకాశం: జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, మండల నాయకుడు రాంబట్లు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు జనార్దన్ రెడ్డి, స్వామి, కనిగిరి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ఉగ్రనరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.