PLD: రాష్ట్రంలోని గ్రామాల్లోని రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో, వినుకొండ నియోజకవర్గానికి సుమారు రూ. 8.61 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా మంజూరైన ఈ నిధులను నియోజకవర్గంలోని బాగా దెబ్బతిన్న రోడ్ల నిర్మాణం కోసం వినియోగిస్తామని జీవీ అన్నారు.