NRML: జిల్లా కాగజ్ నగర్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 19 జోనల్ స్థాయి బాక్సింగ్ పోటీల్లో నర్సాపూర్ (జి) గ్రామానికి చెందిన వెంకటేశ్ 55 కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాడు. దీంతో ఆయన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు బాక్సింగ్ సెక్రటరీ చందుల స్వామి తెలిపారు. వెంకటేశ్ను డీవైఎసీ శ్రీకాంత్ రెడ్డి అభినందించారు.