TG: తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3,461 పంచాయతీల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షిస్తున్నారు. విధుల్లో 50 వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్లటూన్స్ బృందాలు పాల్గొన్నాయి. పోలింగ్ జరిగే గ్రామాల్లో మద్యం దుకాణాలను మూసివేశారు. ఏదైనా సమస్య వస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ 9240021456ని సంప్రదించవచ్చు.