ATP: కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతంలో నాల్గవ పట్టణ పోలీసులు ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిన్న రాత్రి నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లను బ్రీత్ అనలైజర్తో తనిఖీ చేసి, పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తనిఖీలు రోజూ కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.