NTR: రాయితో దాడి చేసిన వ్యక్తికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయ వివరాల ప్రకారం.. గుణదలకి చెందిన నర్సింహారావు అనే వ్యక్తి 202లో తన ఇంటి వద్ద ఉంటున్న ఓ వ్యక్తిపై రాయితో దాడి చేసి గాయపరిచాడు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానం విచారించగా నరసింహారావుకు ఆరు నెలలు జైలుశిక్ష,వెయ్యి రూపాయల జరిమానా విధించారు.