BDK: అశ్వాపురం మండలం మొండికుంట పోలింగ్ కేంద్రంలో గురువారం ఉదయం పోలింగ్ ఏజెంట్లకు పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్స్ సీల్ చూపించే ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి స్థానిక ప్రజలు ఓటును వినియోగించుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే ఏజెంట్ పాసులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహిస్తున్నట్లు అన్నారు.