KMM: సింగరేణి మండలంలో ఎన్నికల విధుల్లో అంగన్వాడీ టీచర్ వనపట్ల విజయ కుమారి (51) మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కొనిజర్ల మండలం డ్యూటీలో ఉండగా స్పృహ తప్పి పడిపోవడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఎన్నికల విధుల్లో మరణించిన ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు.