విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అకాడమిక్ సెల్ను శుక్రవారం ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ డా. బి. దేవి మాధవి తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి పీజీ విద్యార్థుల అకాడమిక్ కార్యకలాపాల సమన్వయం కోసం ఈ సెల్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం ప్రారంబోత్సవంలో భాగంగా డా. వై. పద్మశ్రీ క్లినికల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.