E.G: ఈనెల 13న అనపర్తిలోని సాయి మాధవి డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. పదికి పైగా అగ్రశ్రేణి కంపెనీలు పాల్గొని, పదవ తరగతి నుంచి ఆపై విద్యార్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.