ప్రకాశం: చిర్రికూరపాడులో జల సురక్ష మిషన్లో భాగంగా రూ. 43 లక్షల వ్యయంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ను మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. అనంతరం పైప్లైన్ల ద్వారా గ్రామానికి నీటి సరఫరాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మ్యారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు.