NDL: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో రేపటి నుంచి శ్రీవారికి ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధానార్చకులు క్రీడాంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ .. ప్రతి ఏటా ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ గోదాదేవి ఆండాళ్కు నెలరోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.