అన్నమయ్య: రాజంపేట(M) పులపుత్తూరులో దంపెట్ల మల్లిఖార్జున (40) అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామం మధ్యలో బండరాయితో దాడి చేయడంతో తల వెనుక తీవ్ర గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.