బాపట్ల: పెదగాదెలవర్రులోని చెరువులో అక్రమంగా మట్టి తవ్వి విక్రయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వారం రోజులుగా ట్రక్కుల ద్వారా మట్టి తరలింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఒక్కో లోడు రూ.800 నుంచి 1000 వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల దోపిడి పెరుగుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.