AKP: నర్సీపట్నం టౌన్ ఎస్సై జీ.ఉమామహేశ్వరరావు పెదబొడ్డేపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్ధులకు బుధవారం మహిళా భద్రత, మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. విద్యార్ధులకు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్ధాల వల్ల జీవితాలు సర్వనాశనం అవుతాయన్నారు.