విశాఖ: మధురవాడ నుంచి రేవల్లపాలెం వెళ్లే 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణ పనులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. టీడీఆర్ జారీ ఆలస్యం కారణంగా 12 ఏళ్లుగా నిలిచిపోయిన పనులు ఎమ్మెల్యే చొరవతో మళ్లీ మొదలయ్యాయి. మిగిలిన మూడు టీడీఆర్ సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.