SKLM: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మూడవరోజు గురువారం అమ్మవారికి భక్తులు ఘటాల మొక్కుబడి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఘటాల ఉత్సవాలకు డీఎస్పీలు లక్ష్మణరావు, వివేకానంద స్వీయ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏటువంటి అసౌకర్యం, ఆటంకాలు లేకుండా ఘటాల మొక్కుబడి పూర్తయినట్లు పోలీసు అధికారులు తెలిపారు.