RR: చేవెళ్ల మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ నాయకులు, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో కార్మికులు పురపాలక సంఘం కమిషనర్ను కలిశారు. కార్మికుల సమస్యలపై కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ.. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.