GNTR: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మార్చి 1న అమరావతి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యవేక్షించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆమె, అనంతరం శంకుస్థాపన వేదికలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.