NLR: పొదలకూరు మండలం నావూరు చెరువు కట్టను ఆదివారం పరిశీలించిన వైసీపీ నేత కాకాణి ఇరిగేషన్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల పేరిట సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. పనుల్లో అవినీతి, దొంగ బిల్లులపై సోమిరెడ్డితో నావూరు చెరువు కట్టపైనే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.