కృష్ణ: మచిలీపట్నం శారదానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వేగంగా వెళుతున్న ఇద్దరు యువకులు డివైడర్ని ఢీకొని అక్కడిక్కడే మృతి చెందారు. చిన్నాపురం నుండి కాలేఖాన్ పేట వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియరావల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు.