VSP: కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన నిమ్మకాయల ఈశ్వరమ్మను మహారాణిపేట పోలీసులు 24 గంటల్లోనే ఆచూకీ కనిపెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆమె ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో వేగంగా స్పందించిన సీఐ దివాకర్ యాదవ్, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, డీసీపీ విజయ్ మణికంఠ అభినందించారు.