SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం జలుమూరు మండలం శ్రీముఖలింగం స్వామి వారి ప్రసాదం అమ్మకాల్లో ఇష్ట రాజ్యంగా డబ్బులు దోచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ తరపున ప్రసాదం అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రసాదం వద్ద బోర్డు పది రూపాయలు అని ప్రకటన చేశారు. టికెట్ ఇవ్వకుండా కేవలం డబ్బులు మాత్రమే తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.