E.G: కడియం మండలం వేమగిరిలో ఆధ్యాత్మిక వైభవం మొదలైంది. కెవిఆర్ లేఔట్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పూలరథంపై భక్తులు ఊరేగించారు. వందలాదిమంది మహిళా భక్తులు సంప్రదాయ పసుపు చీరలు ధరించి చేత కాషాయ జెండాలు పట్టి నమో వెంకటేశా అంటూ ముందుకు సాగారు. ఈనెల 26వ తేదీన ఆలయ ప్రతిష్ట జరగనుంది.