VZM: కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు, విహార యాత్రల కోసం విజయనగరం నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు DPTO జి.వరలక్ష్మి గురువారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 16 వరకు పంచారామాలు, శ్రీశైలం, శబరిమలై క్షేత్రాలకు అందుబాటులో ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 9959225620, 7382924103 ఈ నంబర్లు సంప్రదించాలని కోరారు.