KDP: సింహాద్రిపురంలో మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. సమావేశాన్ని ఎంపీడీఓ కార్యాలయం సభ భవనంలో ఏర్పాటు చేశామన్నారు. మండల స్థాయి అన్ని శాఖల అధికారులు వారి శాఖల వివరాలతో హాజరు కావాలన్నారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.