కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామం రాయవారి పేట లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని స్థానికులు అంటున్నారు. దీనికి ఉన్న విద్యుత్ తీగలు కిందకి వేలాడుతుండడంతో స్థానికులు, అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలు కూడా తిరుగుతున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.