KDP: రాష్ట్రంలో కూటమి నాయకులు వైసీపీ నాయకులపై దాడి చేయడమే లక్ష్యంగా పనిచేయడం దారుణమని వైసీపీ ఎస్సీ సెల్ కడప అధ్యక్షుడు కంచుపాటి బాబు మండిపడ్డారు. చంద్రగిరి మండలం పనపాకంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు అజయ్, ఆయన కుటుంబంపై టీడీపీ నాయకులు దాడి చేయడం అమానుషమని అన్నారు. చంటిబిడ్డ ఉందని కూడా చూడకుండా కనికరం లేకుండా ఇలాంటి దాడులు చేయడం బాధాకరమని తెలిపారు.