PLD: చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ నకిలీ మద్యం నివారించాలని నిరసన చేపట్టారు. పార్టీ కార్యకర్తలు ప్రొహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, స్థానిక ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. నకిలీ మద్యం తయారీ, సరఫరాపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.