NLR: వరికుంటపాడు పామూరుపల్లిలో టీడీపీ మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు, సర్పంచ్ తెల్లగొర్ల సుశీల వెంకటయ్య రూ. 10 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను శనివారం చేపట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో మండలంలోని అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు నిర్మాణ పనులను చేపట్టడం జరిగింది అని ఆయన తెలిపారు.